హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టబోయి అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత నాలుక కరుచుకున్నారరు. ట్రోలింగ్ పేరుతో కొందరు యువకులు ప్రజాప్రతినిధుల ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో పోలీసులు ఆ యూట్యూబర్లపై కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యలను ఖండిస్తూ విష్ణువర్ధన్ రెడ్డి బుధవారం ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ‘ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ట్వీట్లు చేసినవారిని తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేయిస్తున్నది’ అని ట్వీట్ చేశారు. ట్రోలర్స్ అరెస్ట్పై పోలీసులు విడుదల చేసి న నోట్ను జతచేశారు. దీంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లైకులు, కామెంట్ల కోసం ట్రోలింగ్ పేరుతో అసభ్యకరమైన వీడియోలు అప్లోడ్ చేసే చానళ్లకు ఎలా సపోర్ట్ చేస్తారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్న ఇలాంటి వారి వెనుక ఎవరు ఉన్నారో విష్ణువర్ధన్రెడ్డి ట్వీట్తో బయటపడిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ సైతం విష్ణువర్ధన్రెడ్డిపై మండిపడ్డారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి నాలుక కరుచుకొని, తన ట్వీట్లను డిలీట్ చేశారు. ఆ పేపర్లో ఏమున్న దో చదవకుండా ట్వీట్లు చేశానని ఒప్పుకున్నారు.