సిరిసిల్ల రూరల్, జూలై 31: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్లో బీజేపీ సీనియర్ నాయకుడు పొన్నం శ్రీనివాస్గౌడ్ కుటుంబానికి కల్యాణలక్ష్మి చెక్కు మంజూరైంది. ఇటీవల శ్రీనివాస్గౌడ్ కూతురు వివాహం కాగా.. కల్యాణ లక్ష్మి పథకం ద్వారా ఆయన భార్య పేరిట రూ.1,00,116 మంజూరయ్యాయి.
ఈ మేరకు ఆదివారం స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్గౌడ్ నివాసానికి వెళ్లి, ఆయన భార్య వాణికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ టీఆర్ఎస్ నాయకులకు స్వీట్లు తినిపించి కృతజ్ఞతలు తెలిపారు.