బషీరాబాద్, మే 10: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని నావంద్గి రైల్వేస్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగుతలేదని చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గానికి చెందిన ఓ యువకుడు బీజేపీ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఫోన్ చేశాడు. దీనికి కొండా బదులిస్తూ.. ‘పోయి పట్టాల మీద పండుకో.. రైలు ఆగుతది’ అని దురుసుగా సమాధానం ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం బషీరాబాద్ మండల కేంద్రానికి చెందిన సందీప్ సుగంధి.. మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకులు కొండా విశ్వేశ్వర్రెడ్డికి ఫోన్ చేసి నావంద్గి రైల్వే స్టేషన్లో ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలు ఆగేలా చూడాలని విజ్ఞప్తి చేశాడు.
మర్పల్లిలో రైలు ఆపుతున్నారని, మండల కేంద్రంలోని నావంద్గి స్టేషన్లో ఆపడం లేదని కొండాకు వివరించాడు. దీంతో కొండా సమాధానం చెప్పలేక ఫోన్లోనే సందీప్ సుగంధిపై కోపంతో ఊగిపోయారు. ‘మర్పల్లిలో నేను రైలుకు ఎదురుగా వెళ్లి ఆపాను. నువ్వు కూడా బషీరాబాద్లో పట్టా ల మీద పండుకొని ఆపు’ అంటూ ఆవేశంగా చెప్పడం తో సదరు యువకుడు ఖంగుతిన్నాడు. ఈ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొండా విశ్వేశ్వర్రెడ్డిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.