హైదరాబాద్ సిటీబ్యూరో, మే 3 (నమ స్తే తెలంగాణ): నిరుద్యోగులను మోసం చే సిన కేసులో బీజేపీ నే త సిద్దిపేటకు చెందిన గడగోని చక్రధర్గౌడ్, అతని బావమరిది గణేశ్ సహా శ్రావణ్, వీరబాబును 4రోజుల పోలీస్ కస్టడీకి బుధవారం కోర్టు అనుమతిచ్చింది. దీంతో గురువారం నలుగురుని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.
నిందితులైన చక్రధర్గౌడ్ సహా ముగ్గురు సెల్ఫోన్, సిమ్కార్డు ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారు. దీంతో సైబర్క్రైమ్ పోలీసులు ప్రధానంగా వాటిపైనే దృష్టి పెట్టారు. చక్రధర్గౌడ్ తన రోజువారీ ఆదాయాలు, చెల్లింపుల వివరాలను తన పర్సనల్ ల్యాప్టాప్లో ఉంచినట్టు సమాచారం. అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ల్యాప్టాప్లలో అది ఉందా? లేదా? మరెక్కడైనా రహస్య ప్రాంతాల్లో దాచి ఉంచాడా? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.