దౌల్తాబాద్, జూన్ 6: తూకంలో మోసం చేస్తూ రైతుల పొట్టగొడుతున్న బీజేపీ నాయకుడు అధికారులకు పట్టుబడ్డారు. మెదక్ జిల్లా దౌల్తాబాద్కు చెందిన బీజేపీ నేత కుమ్మరి నర్సింలు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బాలాజీ వేబ్రిడ్జిని (ధర్మకాంట) నిర్వహిస్తున్నారు. తూకంలో తేడాలను గమనించిన రైతులు తూనికలు కొలతల అదికారికి ఫిర్యాదు చేశారు. రైతుల ఫిర్యాదుతో జిల్లా తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీనివాస్రెడ్డి సోమవారం ధర్మకాంటలో తనిఖీలు చేశారు. లారీ టన్నుకు 80 కిలోల బరువు వరకు తేడాలు వచ్చాయని పేర్కొన్నారు. దీంతో ధర్మకాంట కేంద్రాన్ని తాత్కాలికంగా సీజ్ చేశారు. తూకంలో మోసం చేస్తున్న బీజేపీ నాయకుడు కుమ్మరి నర్సింలుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రజల నోట్లో మట్టి కొట్టే వారికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు.