Etela Rajender | ఇటీవల కాంగ్రెస్ నాయకులతో బీజేపీ నేత ఈటల రాజేందర్ భేటీ అవ్వడం రాజకీయంగా దుమారం రేపింది. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు బయటకు రావడంతో ఈటల బీజేపీకి గుడ్బై చెప్పబోతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో స్పందించిన ఈటల.. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈటల రాజేందర్.. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. అప్పట్నుంచి ఈటల మౌనంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనడం లేదు. దీంతో ఈటల పార్టీ మారబోతున్నారని ప్రచారం మొదలైంది. పైగా కాంగ్రెస్ నాయకులతో ఆయన లంచ్ చేస్తున్న ఫొటోలు ఇటీవల బయటకు రావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చాయి. ఆ ఫొటోలను చూపిస్తూ ఈటల కాంగ్రెస్లో చేరినట్లు ప్రచారం ఎక్కువయ్యింది. ఈ క్రమంలో స్పందించిన ఈటల రాజేందర్.. కాంగ్రెస్లో చేరబోతున్నట్లు వచ్చిన వార్తలను ఖండించారు. ఓ కార్పొరేటర్ గృహప్రవేశ కార్యక్రమంలో అందరితో కలిసి భోజనం చేశానని.. ఆ సమయంలో తీసిన ఫొటోపై దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు.