జైనూర్, ఫిబ్రవరి 22 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన సరిగా లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు ఈటల రాజేందర్ అన్నారు. గురువారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో విజయ్ సంకల్ప యా త్రలో భాగంగా ఈటల రాజేందర్ రో డ్షో నిర్వహించారు. ఈ సందర్భం గా ఈటల మాట్లాడుతూ కాంగ్రెస్ ప్ర భుత్వం ప్రజలకు దాదాపుగా 400కుపైగా హామీలు ఇచ్చిందని అన్నారు.
ఇందులో కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ రాష్ట్రంలో బస్సులు కరువయ్యాయని విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ప్రజల ను మోసం చేసేందుకేనని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవీ అమలుకు సాధ్యం కావని తెలిపారు. రూ.2 లక్షల రుణమాఫీ కూడా రేవంత్తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. తాను గత ప్రభుత్వంలో ఆర్థిక మం త్రిగా చేసిన అనుభవంతో చెబుతున్నానని అన్నారు. అధికారంలోకి రావడానికే రేవంత్రెడ్డి ప్రజలకు మోసపూరిత వాగ్ద్దానాలు చేశారని విమర్శించారు.