DK Aruna | మహబూబ్నగర్, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘మిస్టర్ రేవంత్రెడ్డి ఖబడ్దార్.. నీ కథేందీ.. నోటికొచ్చిన ట్టు మాట్లాడితే సహించం.. వ్యక్తిగత విమర్శలు మానుకో’.. అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హెచ్చరించారు. ‘మీ ఇంట్లో ఆడవారిని ఇలానే దొరసాని అని మాట్లాడుతావా?’ అని నిలదీశారు. ఆదివారం ఆమె మహబూబ్నగర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
‘రేవంత్రెడ్డి, ను వ్వు సీఎంవా? ఆ మాటలేంది? పార్లమెం ట్ ఎన్నికలకంటే ముందే ప్రభుత్వంపై అభద్రతాభావం మొదలవడంతోపాటు.. నీకు ఓటమి భ యం పట్టుకున్నది. నన్ను కిం చపరిచేలా దొరసాని అని మా ట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. సీఎం పదవి వచ్చినా నీ తీరు మార్చుకోకపోతే ఎలా? ఇంకా ప్రతిపక్ష నేతగానే మాట్లాడితే ఎలా? కొంచమైనా తెలివి ఉండొ ద్దా? ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తారని అంటున్నావు. ఓటుకు నోటు వ్యవహారం నీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు కదా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని కోట్లు ఇచ్చి ఓట్లు కొన్నావో చెప్పాలి?అని అరుణ డిమాండ్ చేశారు.