మహబూబ్నగర్ అర్బన్, ఏప్రిల్ 10 : అధికార అహంతో సీఎం రేవంత్రెడ్డి విర్రవీగుతున్నాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రెండ్రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి కొడంగల్లో తనపై అహంకార పూరితంగా మాట్లాడాడని, ఆయన ఏ స్థాయి నుంచి వచ్చారో గుర్తుచేసుకోవాలని సూచించారు. సీఎం తన భాష మార్చుకోవాలని.. ఎవరు ఎంగిలి మెతుకులకు ఆశపడి వచ్చారో ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.