సూర్యాపేట రూరల్: వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో తెలంగాణ గడ్డమీద హిందూ మతం పేరుతో బీజేపీ చేస్తు న్న కుట్రలను సాగనివ్వబోమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం మండల పరిధిలోని కే.టీ.అన్నారం రోడ్డులోని సీతారామ ఫంక్షన్హాల్లో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన తెలంగాణ సాయు ధ పోరాట 74వ వార్షికోత్సవ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు నెమ్మాది వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో పాల్గొని మాట్లాడారు. భూస్వాములు, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం చరిత్రలో లిఖించదగ్గ పోరాటమన్నారు.
పది లక్షల ఎకరాల భూములు పంచడం కోసం వెట్టి నుంచి ప్రజలను విముక్తిని చేసేందుకు 4వేల మంది వీరులు ప్రాణ త్యాగం చేసిన పోరాటం చరిత్రలో మరువ లేనిదన్నారు. అలాంటి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తుందన్నారు. భూమి, భూక్తి, వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం జరిగిన మహత్తర వీర తెలం గాణ విప్లవ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంలో చిత్రీకరిస్తున్న బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. ప్రజలకు సేవ చేయకుండా మేలు చేయకుండా బీజేపీ మతాల మధ్య చిచ్చు పెట్టి కుట్ర సిద్దాంతంతో తెలం గాణలో మత వైశమ్యాలను సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
తెలంగాణ సాయుధ పోరాటంలో స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో పాల్గొనని బీజేపీ ఆ పోరాటంలో బ్రిటీష్ వారికి అమ్ముడుపోయి వారితో లాలూచి పడ్డ పార్టీ బీజేపీ అన్నారు. అంతే కాకుండా స్వతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహిం చిన జాతిపితగా పేరు పొందిన గాంధీని చంపిన గాడ్సేను దేశ భక్తుడని చెప్ప డం దుర్మర్గామన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి సభలు పెట్టి చర్చించి నైతిక హక్కు కూడా బీజేపీకి లేదన్నారు. బీజేపీ దేశాన్ని టోకుగా కాంటాలో పెట్టి అమ్మేస్తుందని ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం, విమానం, రైల్వేశాఖ, ఉక్కును ప్రైవేట్ వారికే అమ్మారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఇంకా పరిష్కారం కాని భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు.
అనంతరం ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటయోధులకు ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కా ర్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లు లక్ష్మి, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున్ రెడ్డి, నాయకులు ముల్కలపల్లి రాములు, కొలిశెట్టి యాదగిరిరావు, ధీరావత్ రవి నాయక్, బుర్రి శ్రీరాములు, కోట గోపి, ఎల్గూరి గోవింద్, మేకనబోయిన శేఖర్, మట్టపల్లి సైదులు, నర్సింహ్మరావు, యాక లక్ష్మి, వెంకటేశ్వర్రావు, బసవయ్య, శంకర్రెడ్డి, పాండునాయక్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.