హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 1: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యాలయాలకు మతం రంగు పులుముతూ విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి మండిపడ్డారు. ఇలాంటి బీజేపీని విద్యార్థులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, విద్య ప్రైవేటీకరణ, కాషాయీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ప్రెస్క్లబ్లో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం-2020 పేరు తో విద్యను కార్పొరేట్ పరం చేయాలని చూస్తున్నదని దుయ్యబట్టారు.