హైదరాబాద్ : ఇవాళ సోషల్ మీడియాలో బీజేపీ గుండాలు అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో నిలిచింది. మహిళలు, సామాన్యులపై బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో బీజేపీ దుమ్ముదులిపారు. 55 వేలకు పైగా ట్వీట్లు చేయగా.. వాటికి బీజేపీ గుండాలు అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.
ప్రజలపై దాడిని ట్విట్టర్ వేదికగా ప్రజలు ప్రశ్నించారు. బీజేపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ రాజకీయ ఎజెండా కోసం రాష్ట్రంలోని శాంతియుత వాతావరణానికి భంగం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు.
జనగామ జిల్లాలో ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర సందర్భంగా మహిళలు, సామాన్యులపై బీజేపీ గుండాల తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సాధారణ ప్రయాణికురాలిపై బీజేపీ నాయకులు దాడి చేశారు. బీజేపీ అంటేనే బట్టే బాజ్ జుగుప్సాకర పార్టీ అని, ఇలాంటి హింసలు తప్ప అభివృద్ధి గురించి ఆలోచించే ఉద్దేశమే లేదని ట్విట్టర్లో ఓ వ్యక్తి స్పందించారు. ఎక్కడ బీజేపీ ఉందో అక్కడ హింస, అశాంతి నెలకొని ఉందని, ఎక్కడ బీజేపీ లేదో అక్కడ అభివృద్ధి పుంజుకుంటుందని ట్విట్టర్లో పలువురు పేర్కొన్నారు. బీజేపీ నాయకులు రాజకీయ నాయకులు కాదని.. వారు కిరాయి గుండాలని స్పష్టంగా తెలుస్తుందంటూ మరొకరు ట్వీట్ చేశారు. అమాయక ప్రజలు ఏం పాపం చేశారని ప్రజల మీద దాడి చేస్తున్నారంటూ ఓ మహిళ ట్వీట్ చేశారు.
This hitlergiri is not acceptable in our country
Totally wrong #BJP_Goondaspic.twitter.com/KUL9kWMGrF— Ramisha♥️ (@RamishaSen) August 24, 2022
The world is thinking about Innovation, Infrastructure & Technology and going forward,
BJP in India is pushing us back focusing just on Hate comments, Riots, Communal fights 💔#BJP_Goondas@KTRTRS @JAGANTRS pic.twitter.com/hbUmDvxuT9
— Arunkumar Netha (@Aruntrs123) August 24, 2022