హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : హైడ్రాతో నగర ప్రగతి కుంటుపడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ జిల్లా పరిధిలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డికి హిట్లర్ అంటే ఇష్టమని, అందుకే ఆయన పాలన కూడా హిట్లర్ తరహాలోనే సాగుతున్నదని చురకలంటించారు.
హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తూ వారిమీద గునపం ఎక్కుపెట్టారని మండిపడ్డారు. వర్షాకాలం వచ్చినా నగరంలో ప్రజలకు కనీసం తాగునీరు అందడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు.