చేవెళ్ల టౌన్, సెప్టెంబర్ 17: రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం లంచం తీసుకుంటూ చేవెళ్ల ఏటీవో అనురాధ, ఎస్టీవో లక్ష్మయ్య మధ్యవర్తి జం గయ్య ఏసీబీకి చిక్కారు. రంగారెడ్డి జిల్లా ఏసీ బీ డీఎస్పీ అనంద్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం .. నాలుగేండ్ల క్రితం ఉద్యోగ విరమ ణ పొందిన ఓ పంచాయతీ కార్యదర్శికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.23 లక్షలు రావాల్సి ఉ న్నది. బిల్లులు ఇప్పించాలని అతడు చేవెళ్ల సబ్ ట్రెజరరీ కార్యాలయ ఏటీవో, ఎస్టీవోను కోరాడు.
అయితే బిల్లులు పాస్ చేయాలంటే తమకు రూ.2.50 లక్షలు ఇవ్వాలని వా రు డిమాండ్ చేశారు. గురువారం చేవెళ్ల కార్యాలయంలో బాధితుడి నుంచి ఏటీవో అనురాధ తరఫున అంటెండర్ జంగయ్య(చిన్న) రూ.50వేలు, ఎస్టీవో లక్ష్మయ్య రూ.50వేలు తీసుకుంటుండగా అధికారులు పట్టుకొని కేసు నమోదు చేశారు.