ఉప ఎన్నిక సమీపిస్తున్న వేళ టీఆర్ఎస్లోకి చేరికల పర్వం కొనసాగుతున్నది. శనివారం జమ్మికుంటలో మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో 50 మంది యువత బీజేపీ నుంచి టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో పలువురు బీజేపీ కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. కమలాపూర్ మండలం గూడూరుకు చెందిన బీజేపీ కార్యకర్తలు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు. శనిగరం గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం ఉపాధ్యక్షుడు బండి రమేశ్తోపాటు పలువురు టీఆర్ఎస్లో చేరారు.
ఖైరతాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో క్రైస్తవుల సంపూర్ణ మద్దతు టీఆర్ఎస్కేనని తెలంగాణ యునైటెడ్ క్రిస్టియన్స్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాల్మన్రాజ్ తెలిపారు. శనివారం సాయంత్రం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రైస్తవుల సంక్షేమానికి అనేక పథకాలు తీసుకువచ్చారని, హుజూరాబాద్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు గెలుపు కోసం కృషిచేస్తామని చెప్పారు.