చేగుంట, నవంబర్ 14: మెదక్ జిల్లా చేగుం ట మండలంలో బీజేపీ ప్రచారంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఎన్నికల ప్రచారంలో భాగం గా దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు మంగళవారం చేగుంట మండలం రుక్మాపూర్ కు వచ్చారు. రఘునందన్రావుతో మాట్లాడుతున్న సమయంలో.. దళిత యువకుడు కొలుపుల దినేశ్ గత ఉప ఎన్నికల్లో ఇప్పిస్తానన్న పట్టాలేవీ అని ప్రశ్నించాడు. పక్కనే ఉన్న బీజేపీ నాయకులు అతనిపై దాడి చేశారు.
రుక్మాపూర్ సర్పంచ్ భర్త అంజిరెడ్డి మద్యం తాగించి గొడవకు ఉసిగొలుపుతున్నాడని ఎమ్మెల్యే రఘునందన్రావు ఆరోపించారు. ‘మేం మద్యం తాగి వచ్చామా?’ అని దినేశ్ నిలదీయగా.. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.