మహబూబ్నగర్/పాలకుర్తి రూరల్/అడ్డగూడూరు, జూలై 31: సీఎం కేసీఆర్ సర్కారు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మెచ్చి ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారు. ఆదివారం కూడా పలు చోట్ల పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొన్నారు. మహబూబ్నగర్లోని 24వ వార్డు టీఆర్ఎస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, ఎంఐఎం, టీడీపీలకు 500 మంది నాయకులు, కార్యకర్తలు మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చౌడూరు గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన 30 మంది వివిధ పార్టీలకు చెందిన వారు హైదరాబాద్లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.