హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుకు ఆధార్ లింకు చేసి, రైతుల బయోమెట్రిక్ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఈ మేర కు ఆ శాఖ కమిషనర్ అనిల్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రతి పీపీసీ కేంద్రంలో బయోమెట్రిక్ విధానం అమలు చేయనున్నారు. రైతు తన వేలిముద్ర వేసిన తర్వాతే ధాన్యం కొనుగోలు చేయనున్నారు. ఆధార్ లేని వారు కొత్తగా ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోవాలని సూచించారు.