హైదరాబాద్ : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ప్రముఖ ఫార్మా దిగ్గజం బయోలాజికల్ ఈ జీనోమ్ వ్యాలీలో పెట్టుబడి పెట్టనున్నది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్తో గురువారం జరిగిన భేటీలో సంస్థ ప్రతినిధులు విస్తరణ ప్రణాళికలను ప్రకటించారు. జీనోమ్ వ్యాలీలోని తమ ప్లాంట్లో రూ.1800కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు మంత్రి కేటీఆర్కు వివరించారు.
దీంతో 2500 మందికి ఉపాధి లభిస్తుందని కంపెనీ తెలిపారు. జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్, ఎంఆర్ వ్యాక్సిన్, పీసీవీ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, కొవిడ్ వ్యాక్సిన్, టెటానస్ టాక్సైడ్ ఆంపౌల్స్, బయోలాజికల్ ఏపీఐలు, ఫార్ములేషన్స్ తయారీపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. జీనోమ్ వ్యాలీలో బయోలాజికల్ – ఈ విస్తరణను ప్రకటించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ వ్యాక్సిన్ల రాజధానిగా పేరుగాంచిందన్న కేటీఆర్.. బయోలాజికల్ ఈ విస్తరణతో దీనికి మరింత బలం చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో బయోలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.
Delighted to announce the expansion of Biological E in Genome Valley, which makes Hyderabad the only region in the world to produce 14 billion doses of vaccines
Hyderabad is already known as the “Vaccine Capital of the World” & this expansion further accelerates strength https://t.co/D5kgvM6eAC
— KTR (@KTRTRS) July 21, 2022