హైదరాబాద్ : బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ నగరం మరోసారి వేదికైంది. ఈ ఏడాది కూడా హైదరాబాద్ నగరంలోనే రెండు రోజుల పాటు బయో ఆసియా సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సును ఫ్యూచర్ రెడీ థీమ్తో నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఫిబ్రవరి 24, 25 తేదీల్లో నిర్వహించే ఈ సదస్సుకు 70కి పైగా దేశాల నుంచి 30 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. బయో ఆసియా సదస్సు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగనుంది. బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఫ్లాగ్షిప్ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొవిడ్ దృష్ట్యా ఈసారి బయో ఆసియా సదస్సు వర్చువల్గా జరగనుంది.
గతేడాది కూడా హైదరాబాద్ వేదికగా బయో ఆసియా సదస్సు జరిగింది. నాడు ‘మూవ్ ద నీడిల్’ థీమ్తో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి 30 వేల మంది వివిధ రంగాలకు చెందిన నిపుణులు హాజరయ్యారు. 2020 సంవత్సరంలోనూ బయో ఆసియా సదస్సుకు హైదరాబాద్ వేదికైన విషయం తెలిసిందే.