గద్వాల : రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఓ యువకుడు తన బైకుకు నిప్పు అంటించాడు. ఈ సంఘటన గద్వాల నియోజకవర్గంలోని ధరూర్ మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి సామాన్యుడు భరించలేని విధంగా పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో నిరసన వ్యక్తం చేస్తూ మండల కేంద్రంలోని వైయస్సార్ చౌరస్తాలో తన బైకుకు నిప్పు అంటించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. ఆంజనేయులును ఇంటిదగ్గర వదిలిపెట్టారు.