కంఠేశ్వర్, అక్టోబర్ 16 : తన స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధికి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా భారీ విరాళం అందజేశారు. మాక్లూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం రూ.కోటి విరాళమిచ్చారు. గురువారం ఆయన తన సోదరుడు మహేశ్ గుప్తాతో కలిసి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డికి చెక్కు అందజేశారు.