నిజామాబాద్ : ప్రజా సేవలో నిరంతరం ముందుండే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి నాయకులు, అభిమానులు వివిధ రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ కవిత మెట్టినిల్లు అయిన పొతంగల్ గ్రామంలో మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు.
స్థానిక ఎమ్మెల్యే షకీల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు గాను గ్రామంలోని 80 మందికి తెలంగాణ జాగృతి సైకిళ్లు అందజేసింది. విద్యను ప్రోత్సహించడంలో ఎల్లప్పుడూ ముందుండే ఎమ్మెల్సీ కవిత స్ఫూర్తితోనే సైకిళ్లు పంపిణీ చేశామని తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా కోడలు కావడం ఇక్కడి ప్రజల అదృష్టం అని ఎమ్మెల్యే షకీల్ అన్నారు ఎమ్మెల్సీగా, ఎంపీగా కవిత చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని తెలిపారు.
ఆపత్కాలంలో అన్నపూర్ణగా..అభాగ్యులకు అండగా ఉంటున్న కవిత ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్, REDCO చైర్మన్ అలీం, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్, నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తారిక్ అన్సారీ, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడె రాజీవ్ సాగర్, నిజామాబాద్ జాగృతి అధ్యక్షురాలు అవంతి రావు, నిజామాబాద్ జిల్లా తెలంగాణ జాగృతి యూత్ కన్వీనర్ రేహాన్, తదితరులు పాల్గొన్నారు.