బయ్యారం, డిసెంబర్ 18: చేతికొచ్చిన పంటకు నష్టం వాటిల్లిందన్న మ నోవేదనతో పురుగు మందు తాగిన రైతు సోమవారం మృతిచెందాడు. మ హబూబాబాద్ జిల్లా బయ్యారం మం డలం రెడ్యాతండాకు చెందిన లూలావత్ బిచ్యా (48) మూడెకరాల్లో మిరప పంట సాగు చేశాడు.
తెగులు రావడంతో పం ట పూర్తిగా దెబ్బతిని రూ.2 లక్షల వర కు నష్టం వాటిల్లింది. చేనులో బోరుమోటర్ కాలిపోవడంతో మరింత కుంగిపోయాడు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చేనుకు వెళుతున్నానని ఇంటి వద్ద చెప్పి వెళ్లిన బిచ్యా అక్కడే పురుగుల మందు తాగాడు. స్థానిక రైతులు, కుటుంబ సభ్యులు మహబూబాబాద్ ఏరియా దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు.