భూపాల్రెడ్డికి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల అభినందన
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ): శాసనమండలి చైర్మన్ ప్రొటెమ్గా నియమితులైన వెన్నవరం భూపాల్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, మహమూద్ అలీ, మండలి చీఫ్విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ విప్లు భానుప్రసాద్, ఎంఎస్ ప్రభాకర్, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, గంగాధర్గౌడ్, శ్రీనివాస్రెడ్డి, ఫారుక్ హుస్సేన్, జాఫ్రీ, ఎమ్మెల్యేలు గూడెం భూపాల్రెడ్డి, చంటి క్రాంతికిరణ్, శాసనసభ సెక్రటరీ డాక్టర్ వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి, మండలి మాజీ వైస్చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, ఫరీదుద్దీన్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. తనకు చైర్మన్ ప్రొటెమ్గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి భూపాల్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ నేతలు, భూపాల్రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.