హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): టీటీడీ నూతన చైర్మన్గా భూమన కరుణాకర్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గరుడాళ్వార్ సన్నిధిలో ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనతో ప్రమాణం చేయించారు.
అనంతరం భూమన కుటుంబసభ్యులతో కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వేద పండితులు ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాసర్రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.