యాదాద్రి భువనగిరి : భూదాన్ పోచంపల్లి(Bhudan Pochampalli) మున్సిపాలిటీ కేంద్రంలో వస్త్ర దుఖానాల్లో (Cloth shops) విజిలెన్స్, ఎన్ఫోర్మెంట్స్(Vigilance officers) అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక్కత్ వస్త్రాలను(Ikkat cloths) పోలిన డూప్లికేట్ చీరలను అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారంతో 15 మంది బృందంతో వస్త్ర దుఖానాల్లో తనిఖీలు చేపట్టారు.
షాపుల్లో ప్రస్తుతం ఉన్న స్టాక్, బిల్లులను వారు పరిశీలించారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఇక్కత్ చీరలకు బదులుగా సూరత్ నుంచి ప్రింటింగ్ చీరలు తీసుకొచ్చి ఇక్కత్ చీరెలు పేరుతో విక్రయిస్తున్నారనే సమాచారంతో ఉన్నతాధికారుల సూచన మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.