న్యూఢిల్లీ/హైదరాబాద్/నాంపల్లి కోర్టులు, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిని గురువారం హైదరాబాద్లోని సీబీఐ కోర్టు ఎదుట అధికారులు హాజరుపర్చారు. ఈ కేసును 16వ తేదీకి వాయిదా వేస్తూ ప్రిన్సిపల్ జడ్జి రమేశ్బాయి ఆదేశాలు జారీ చేశారు. భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాయి.
తీర్పు వాయిదా పడింది. మరోవైపు భాస్కర్రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని వివేకానందరెడ్డి కుమార్తె సునీత సీబీఐ కోర్టులో లిఖితపూర్వక వాదనలు సమర్పించారు. కాగా, ఎంపీ అవినాశ్రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సునీత ఇటీవల దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.