పాలకుర్తి రూరల్, మే 13: అంతర్జాతీయ స్థాయిలో సిస్కో నెట్ వర్కింగ్ అకాడమీ నిర్వహించిన పోటీల్లో ఓ మారుమూల గ్రామానికి చెందిన అమ్మాయి సత్తాచాటింది. వివిధ దేశాల విద్యార్థులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రా మంలో రైతు కుటుంబానికి చెందిన పొన్నాల సోమిరెడ్డి, భారతి దంపతుల కుమార్తె భాషిత ఈ ఘనత సాధించింది. భాషిత తండ్రి సోమిరెడ్డి హైదరాబాద్లో స్థిర పడ్డారు. భాషితను ఉన్నత చదువులు చదివించారు.
ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నది. గత నెల 29న నెట్ వర్కింగ్ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఆసియా పసిఫిక్ జపాన్ అండ్ గ్రేటర్ చైనా (ఏపీజేసీ)నెట్ క్యాడ్ రైడర్స్ పోటీల్లో భాషిత పాల్గొన్నది. ఆన్లైన్ పోటీల్లో దేశవ్యాప్తంగా 994మంది విద్యార్థులు పాల్గొనగా.. భాషిత మొదటి స్థానంలో నిలిచిం ది. ఈ నెల 24న అంతర్జాతీయ స్థాయి ఫైనల్స్లో 15 దేశాలకు చెందిన టాపర్స్ తో ఆమె పోటీపడనున్నది. ఈ పోటీల్లో గ్లోబల్ టాపర్గా నిలుస్తానని భాషిత ధీ మా వ్యక్తం చేసింది. పల్లెలో పుట్టి పెరిగిన భాషిత ప్రపం చ స్థాయిలో ర్యాంక్ సాధించడం జనగామ జిల్లాకే గర్వకారణమని సర్పంచ్ ముస్కు నిర్మలాచంద్రబాబు, ఎంపీటీసీ కొడిశాల యాదగిరి, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.