Mahesh Bighala | తెలుగు జాతి గర్వించదగ్గ భారత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేష్ బిగాల డిమాండ్ చేశారు . తెలంగాణలో అత్యంత వైభవంగా పీవీ శతజయంతి ఉత్సవాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిందన్నారు. భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ పెద్ద ఎత్తున చేసారని గుర్తు చేశారు . పీవీ సెంటినరీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు, ఓవర్సీస్ కన్వీనర్ మహేశ్ బిగాల… పీవీకి భారతరత్నను సాధించే దిశగా ఏకంగా ఆన్ లైన్ లో ఓ పెద్ద ఉద్యమాన్నే మొదలు పెట్టారన్నారు.
ఏడాది పొడవునా నిర్వహించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు 2021 జూన్ 28న విజయవంతంగా పూర్తైన విషయాన్నీ మహేశ్ బిగాల గుర్తు చేశారు . ఇప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చొరవ తీసుకొని పీవీకి భారతరత్న ఇవ్వాలని మహేష్ బిగాల కోరారు. పీవీకి భారతరత్న అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా కోరారు.