హైదరాబాద్, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో- ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(విజయ డెయిరీ) చైర్మన్గా సోమా భరత్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా చైర్మన్ భరత్ కుమార్ను మంత్రి తలసాని శాలువాతో సతరించి, శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మాజీ కార్పొరేటర్ మమతా సంతోష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.