సిద్దిపేట : కొమురవెళ్లి మల్లన్న ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కోరమీసాల స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణతో మల్లన్న క్షేత్రం పులకించిపోయింది.
స్వామివారికి పట్నాలు, మట్టి పాత్రలలో అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొవిడ్ నిబంధనల మేరకు ఆలయ వర్గాలు ఏర్పాట్లు చేశాయి.