భద్రాచలం: దక్షిణాది అయోధ్య భద్రాచలంలో (Bhadrachalam) వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకో రూపంలో దర్శనమిస్తున్నారు. ఐదో రోజైన శుక్రవారం వామానావతారంలో కనిపించనున్నారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో ఉత్సవాలు ఏకాంతంగా జరుగుతున్నాయి. వేదపండితులు లక్ష్మణ సమేత సీతారాములకు విశేష స్నపన తిరుమంజనం నిర్వహిస్తున్నారు.
శ్రీరామచంద్రుడు శనివారం పరశురామావతారంలో, 9న శ్రీరామావతారం, 10న బలరామావతారం, 11న శ్రీకృష్ణావతారంలో స్వామివారు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 12న గోదావరిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు. 13న స్వామివారు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నారు. ఈ నెల 13 వరకు ఆలయంలో నిత్యకల్యాణాలు రద్దుచేశారు.