హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదివారం పదిమందితో భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కమిటీని నియమించారు. మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణ కోసం ఈ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. కమిటీలో రావులపాటి రాంప్రసాద్, తాండ్ర వెంకటరమణారావు, మానే రామకృష్ణ, బోదెబోయిన బుచ్చయ్య, గుడవర్తి నరసింహమూర్తి, సాగిని శ్రీనివాసరాజు, కోటేరు శ్రీనివాసరెడ్డి, దొడ్డి తాతారావు, రమేశ్గౌడ్, సాదనపల్లి చిట్టిబాబు కమిటీలో ఉన్నారు. పార్టీ శ్రేణులకు, ప్రజలకు మధ్య ఈ కమిటీ సంధానకర్తగా వ్యవహరిస్తుంది.