అబద్ధం: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్రావుపేటలో గొర్ల కోసం చల్లూరి సత్తయ్య షెడ్డు వేసుకున్నాడు. ఆయన ఖాతాలో రూ.9.90 లక్షలకు గాను రూ.1.32 లక్షలు మాత్రమే జమ చేశారు. వాటితోనే షెడ్డు వేసుకున్నాడు. మూడు నెలల కావస్తున్నా మిగతా డబ్బులు వేయలేదంటూ అతని ఫొటోతో కూడిన కథనాన్ని ఓ పత్రిక (నమస్తే తెలంగాణలో కాదు)లో రాశారు.
నిజం: చల్లూరి సత్తయ్య దళితబంధు పథకం కింద గొర్రెలు పెంచుకోవాలని భావించాడు. యూనిట్ కోసం దరఖాస్తు చేసుకోగా, అధికారులు అతని ఖాతాలో రూ.9.90 లక్షలు జమ చేశారు. అందులో షెడ్డు నిర్మాణానికి రూ.1.32 లక్షలు ఇచ్చారు. వాటితోనే షెడ్డు వేసుకొన్నాడు. ఇటీవల భారీ వర్షాలు కురవడం, దానికితోడు జీవాలకు లింపీ స్కిన్ వ్యాధి వస్తుండటం, వాటిని రవాణా చేయొద్దనే ఆంక్షలు ఉండటంతో కాస్త ఆలస్యమైంది. ‘రోగం వస్తున్నదని తెలిసి మేం కూడా వద్దన్నాం. కానీ ‘మొన్న ఎవరో జగిత్యాల నుంచి మేం సార్లమని వచ్చిన్రు. మీ షెడ్డు దగ్గర ఫొటో దిగాలే అనడంతో దిగినం. మమ్ముల ఇంత బదనాం చేస్తరని అనుకోలేదు. ఏదో పేపర్లో ఆల్ల ఇష్టం ఉన్నట్టు రాసిండట, మాకు చానా బాదైతంది’ అని చల్లూరి సత్తయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.