బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 26: గన్నీ బ్యాగుల పంపిణీలో అధికారులు, సిబ్బంది తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని సహకార సంఘాన్ని 500 మంది రైతులు ఆదివారం ముట్టడించారు. ధాన్యం ఆరబెట్టి రోజులు గడుస్తున్నా, గన్నీ బ్యాగుల కొరత పేరుతో ధాన్యాన్ని కాంటా చేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొంతమంది సిబ్బంది బడా రైతులతో కుమ్మక్కై వారికే గన్నీ బ్యాగులు ఇస్తున్నారని ఆరోపించారు. గన్నీ బ్యాగులు లేక ధాన్యం కల్లాల్లోనే ఉన్నదని, తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు.