నర్మెట, జనవరి 31: బీరుసీసాలో తేలు ప్రత్యక్షమైన ఘటన జనగామ జిల్లా నర్మెటలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్నది. నర్మెటకు చెందిన కన్నెబోయిన కరుణాకర్, మరో వ్యక్తితో కలిసి స్థానికంగా గల ఓ వైన్స్లో రెండు బీర్లు కొనుగోలు చేశారు. బీరు తాగేందుకు బాటిల్ మూత తీసి గ్లాసులో బీరు పోశారు.
కొంచెం తాగగానే దుర్వాసన రావడంతో బీరు బాటిల్ను పరిశీలించి చూడగా అందులో చనిపోయిన తేలు కనిపించింది. వెంటనే వారు బీరు సీసాతో వెళ్లి వైన్స్ యజమాని అడగ్గా.. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారు కొద్దిసేపు మద్యం షాపు ఎదుట నిరసన తెలిపారు. ఈ విషయమై వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఎక్సైజ్ అధికారులు అందుబాటులోకి రాలేదు.