Pillalamarri | మహబూబ్నగర్, మే 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చేవెళ్ల రూరల్: మిస్వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా పిల్లలమర్రి, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరులోని ఎక్స్పీరియం ఎకో ఫ్రెండ్లీ పార్కులో సందడి చేశారు. వివిధ దేశాలకు చెందిన 22 మంది ప్రపంచ సుందరీమణులు తొలుత మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ బృందానికి కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ జానకి ఘనస్వాగతం పలికారు.
అనంతరం పిల్లలమర్రి చేరుకొని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. మ్యూజియం వద్ద ప్రపంచ సుందరీమణులతో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి, వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి ఫొటో దిగారు. పిల్లలమర్రి ప్రాముఖ్యత గురించి స్క్రీన్ ద్వారా వివరించారు. అనంతరం మహిళలతో కలిసి కొద్దిసేపు బతుకమ్మ ఆడి సందడి చేశారు. మిస్ వరల్డ్ ఆసియా-ఓషియానియా గ్రూప్ నుంచి 24 మంది సుందరీమణులు ప్రొద్దుటూరులోని ఎకో ఫ్రెండ్లీ పారును సందర్శించారు.
వీరిలో 2024 మిస్ వరల్డ్ కిరీటధారిణి చెక్ రిపబ్లిక్కు చెందిన క్రిస్టీనా పిసోవా కూడా ఉన్నారు. అక్కడ ఉన్న అరుదైన మొక లు, వృక్షజాతులు, శిల్పకళా సంపదను వీక్షించారు. అంతకు ముందు ప్రభుత్వం పర్యాటక శాఖ, పార్కు నిర్వాహకుల ఆధ్వర్యంలో సంప్రదాయ బద్దంగా డోలు, మేళతాలాలతో సుందరీమణులకు స్వాగతం పలికారు. అనంతరం వారు పర్యావరణ అనుకూల బగ్గీలలో ఎక్స్పీరియం పారులో పర్యటించారు.