మారుతీనగర్, జూన్, 30: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సూచించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఏడో వార్డు హన్మాన్నగర్కు చెందిన మహ్మద్ గులాం ఇంటి ఎదుట మురుగునీరు చేరి దుర్గంధం వ్యాప్తించగా ఆయన కూతురు హర్ష ఎమ్మెల్యేకు ఫోన్ ద్వారా బుధవారం సమస్యను వివరించింది. స్పందించిన ఎమ్మెల్యే గురువారం ఆ కాలనీకి వెళ్లి హర్ష కుటుంబ సభ్యులను కలిసి సమస్యను తెలుసుకొన్నారు. మురుగు సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కౌన్సిల్లో డ్రైనేజీ నిర్మాణ ప్రతిపాదన అంశాన్ని చేర్చి ఆమోదించాలని మున్సిపల్ చైర్పర్సన్ సుజాతకు సూచించారు. కాలనీలోని లోతట్టు ప్రాంతాల ఇండ్లకు వెళ్లి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. హర్ష ఫోన్కాల్కు స్పందించి కాలనీకి వచ్చిన ఎమ్మెల్యేను చూసి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.