హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో బీసీలకు ప్రయోజనాలు కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, హామీల అమలుకు బీసీలు మరో జాతీయ సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు పిలుపునిచ్చారు. ఆదివారం కాచిగూడలోని బీసీ దళ్ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వకుళాభరణం మాట్లాడారు. బీసీల ఆకాంక్షలను నెరవేర్చని బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.
బీసీల మనోభావాలు గ్రహించి సీఎం కేసీఆర్, అసెంబ్లీలో కులగణన తీర్మానం చేసి, కేంద్రానికి పంపి తన నిజాయితీని చాటారని గుర్తు చేశారు. బీజేపీ మంత్రులు, ఎంపీలకు దమ్ము, ధైర్యముంటే కులగణన విషయంలో ప్రధానిపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. వచ్చే పార్లమెంట్ సమాశాల్లో దీనిపై అన్ని రాజకీయ పార్టీలు నిలదీయాలని పిలుపునిచ్చారు. దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో బీసీల అభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికి వదిలేసి, ఇకడేమో బీజేపీ నాయకులు శుష వాగ్దానాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.