హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంటులో పెట్టకపోతే ప్రభుత్వంపై మిలిటెంట్ తరహా ఉద్యమం చేపడతామ ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టి, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద బీసీ సంఘం ఆధ్వర్యం లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు పార్లమెంటు ముట్టడికి యత్నించారు. పార్లమెంట్వైపు వెళ్లేందుకు ప్రయత్నించటంతో ఉద్యమకారులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలోని 75కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హకులు కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం అణచివేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ రూ.38.45 లక్షల కోట్లుంటే, బీసీలకు కేవలం రూ.1,400 కోట్లు కేటాయిస్తారా? అని నిలదీశారు. ఇంత తకువ బడ్జెట్తో దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు బిస్కెట్లు కూడా రావని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేవరకు వెనకి తగ్గేదే లేదని బీసీ నేత దాసు సురేశ్ తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, జీ అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.