హైదరాబాద్, జనవరి27 (నమస్తే తెలంగాణ): దేశంలో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను 27 నుంచి 50 శాతానికి పెంచేందుకు చొరవ చూపాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్రాజ్ గంగారామ్ను జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి కోరారు.
హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చైర్మన్ను హరిత ప్లాజాలో శనివారం ప్రత్యేకంగా కలిసిన కుమారస్వామి వినతిపత్రం అందజేశారు. జనగణనతోపాటు ఓబీసీ కులగణన చేపట్టేలా కేంద్రానికి సిఫారసు చేయాలని విజ్ఞప్తి చేశారు. కులగణనతోనే సామాజిక న్యాయం, అసమానతలు లేని సమాజం సాధ్యమని పేర్కొన్నారు. బలహీనవర్గాల సమస్యలు, బీసీల కోసం చేపట్టాల్సిన సంక్షేమ పథకాలు, ఓబీసీ రిజర్వేషన్లు తదితర అంశాలపై ఆయనతో చర్చించారు.