హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): బీసీ ఓవర్సీస్ సాలర్షిప్ మంజూరై విదేశాల్లో ఉన్నత విద్య చదువుతున్న విద్యార్థులకు వెంటనే నిధులు విడుదల చేయాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేర కు ప్రజాభవన్లో శుక్రవారం రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జీ చిన్నారెడ్డిని కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాలు అందజేశారు. విదేశీ విద్య సాలర్షిప్ సంఖ్యను 300 నుంచి కనీసం 1,000 మందికి పెంచాలని కోరారు.