హైదరాబాద్ : సీఎం కేసీఆర్ బీసీ కుల గణన అంశానికి ఉన్న ప్రాధాన్యతను గ్రహించి శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం పట్ల టీఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ప్రస్తుత దేశ రాజకీయాల్లో బీసీ సామాజిక వర్గాల పాత్ర కీలకంగా మారిందన్నారు.
దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీ సామాజిక వర్గాల కుల గణన నిర్వహిస్తే బీసీ వర్గాలకు మరింత మేలు జరుగుతుందని రమణ తెలిపారు. ఇందుకోసం వారం రోజుల క్రితం సెంట్రల్ కోర్ట్ హోటల్లో జరిగిన సమావేశంతో పాటు అక్టోబర్ ఏడో తారీఖున సోమజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ గణన గురించి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనట్లు గుర్తు చేశారు.
ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను, వక్తల అభిప్రాయాలను బీసీ కుల గణన ఆవశ్యకత పట్ల సీఎం కేసీఆర్కు వివరించడంతో సానుకూలంగా స్పందించారన్నారు. బిల్లుకు సహకరించిన శాసన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.
అలాగే బీసీ కుల గణన కోసం వివిధ రూపాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి బీసీవ ర్గాల్లో ఏకాభిప్రాయం తీసుకొచ్చేవదుకు అవిశ్రాంత ప్రయత్నం చేసిన బీసీ సంఘాల నాయకులను అభినందించారు.
అలాగే కవి, రచయిత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరు గౌరీ శంకర్ కూడా సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. 2021లో జరిగే జనాభా గణనలో బీసీ కుల గణన చేపట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేయడం హర్షణీయమన్నారు.