హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): బీసీ బిడ్డ, బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ముదిరాజ్ అరెస్టు అమానుషమని జనగణన వేదిక జాతీయ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు.
ప్రశాంత్ అరెస్టును ఖండిస్తూ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ బీసీ బిడ్డ ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు.