‘పల్లె ముచ్చట్లు’ టీం మరో సక్సెస్ సాధించింది. రేణికుంట సతీశ్కుమార్ దర్శకత్వంలో శ్రీమతి మంజీత కుమార్ కథ, మాటలు అందించిన ‘రైతు బతుకు పోరాటం’ షార్ట్ ఫిలింను హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఈ నెల 18న (శనివారం) ప్రదర్శించనున్నారు. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సినీవారంలో భాగంగా ఈ షార్ట్ ఫిలింను ప్రదర్శిస్తున్నారు.
‘అవార్డియో నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ 2022-23’ బరిలో దిగిన ‘రైతు బతుకు పోరాటం’ షార్ట్ ఫిలిం ప్రదర్శన ఈసారి అతిరథ మహారథుల సమక్షంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో జరుగనుంది. ఈ నెల 18న సాయంత్రం 6-9 గంటల వరకు పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్, 2వ అంతస్తు, రవీంద్ర భారతిలో షార్ట్ ఫిలిం ప్రదర్శనతోపాటు చిత్ర బృందంతో ముఖాముఖి కార్యక్రమం కూడా ఉంటుందని శ్రీమతి మంజీతకుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు.