గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తెలంగాణ జాగృతి
హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహ్మాన్ సంగీతంతో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ రూపొందించిన బతుకమ్మ పాటను త్వరలోనే విడుదల చేసేందుకు తెలంగాణ జాగృతి సంస్థ సిద్ధమవుతున్నది. ఇద్దరు దిగ్గజాలు కలిసి రూపొందించిన ఈ పాట అద్భుతంగా ఉన్నదని, దేశవ్యాప్తంగా ట్రెండ్ అయ్యే అవకాశం ఉన్నదనే అభిప్రాయాన్ని తెలంగాణ జాగృతి నాయకులు వ్యక్తంచేస్తున్నారు.