హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 1, 2వ తేదీల్లో వేడుకలను నిర్వహించనున్నట్టు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు వీ మమత, ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణలు తెలిపారు. సోమవారం నాంపల్లిలోని టీజీవో భవన్లో బతుకమ్మ సంబురాల పోస్టర్ను వారు విడుదల చేశారు. రాష్ట్రంలో మహిళా ఉద్యోగులంతా ప్రభుత్వ కార్యాలయాల్లో బతుకమ్మను పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని మమత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సుజాత, సబిత, స్వర్ణలత, శిరీష, స్వరూపారాణి, డాక్టర్ అమరావతి, లావణ్య, రేవతి, రాధ, డాక్టర్ అనిత, కవిత, తనుజ తదితరులు పాల్గొన్నారు.