హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ పండుగను ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. పలు ప్రభుత్వశాఖల్లోని అధికారులు బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్నారు. బతుకమ్మ అంటేనే ప్రకృతి పండుగని పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రకృతిలోని రంగురంగుల పువ్వులతో గౌరీదేవిని పూజించే గొప్ప పండుగని పేర్కొన్నారు. టీజీవో ఆధ్వర్యంలో మంగళవారం సైఫాబాద్లోని రవీంద్రభారతి ఆవరణలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. పండుగ నిర్వహణకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని తెలిపారు. సంబురాల్లో టీజీవో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీ మమత, ఏ సత్యనారాయణ, కోశాధికారి రవీంద్రకుమార్, సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శి హరికృష్ణ, నగరశాఖ అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, కార్యదర్శి టీ లక్ష్మణ్గౌడ్, రాజ్కుమార్గుప్తా, మహిళా నేతలు సుజాత, విజయలక్ష్మి, జయప్రదబాయి, ఏంజులరెడ్డి, డాక్టర్ పద్మ, స్వర్ణలత, శిరీష, హేమానళిని, డాక్టర్ లీల, సునీతాజోషి, శైలజా, స్వాతి, దీప్తి, ఉమా, డాక్టర్ రజినీ, స్వరూప, రేవతిరోహిణి, సీతాలక్ష్మి, హరిత, జయకామేశ్వరి, సంధ్యారాణి, సముజ్వల, ప్రశాంతి, రూప తదితరులు పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో ఢిల్లీలోని తెలంగాణ భవన్ సందడిగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కేఎం సాహ్నీ ప్రారంభించిన వేడుకలో ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, ఏపీ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉన్నత విద్య గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, నగర అధ్యక్షుడు జీ వెంకటేశ్వర్లు, సత్యనారాయణగౌడ్, ప్రభాకర్రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, టీఎస్పీఎస్సీలో కార్యదర్శి అనితారామచంద్రన్, సభ్యులు బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్లో ఉద్యోగినులు బతుకమ్మ పండుగ చేసుకున్నారు. పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్ తదితరులు పాల్గొన్నారు.