హైదరాబాద్, అక్టోబరు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్ డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో చేనేత బతుకమ్మ – దసరా సంబురాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యూకే నలుమూలల నుంచి 3 వేలకు పైగా ఎన్నారై కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా స్థానిక ఎంపీ సీమ మల్హోత్రా (లేబర్ పా ర్టీ షాడో మినిస్టర్), హౌంస్లౌ మేయర్ ఆఫ్జాల్ కియాని, కౌన్సిలర్ ఆదేశ్ ఫార్మహాన్ హాజరయ్యారు.
ఈ సంవత్సరం కూడా బతుకమ్మ దసరా వేడుకలను ‘చేనేత బతుకమ్మ, దసరా’ గా జరుపుకున్న ట్టు ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు, టాక్ నేషనల్ కన్వీనర్ అశోక్గౌడ్ దూసరి తెలిపారు. టాక్ కార్యవర్గానికి అన్ని సందర్భాల్లో ఎమ్మెల్సీ కవిత వెన్నంటి ప్రోత్సహిస్తున్నారని, టాక్ తలపెట్టిన ప్రతీ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేశామని చెప్పారు. కార్యక్రమంలో టాక్ అడ్వయిజరీ బోర్డు చైర్మన్ మట్టారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేశ్ బు డగం, కార్యదర్శులు రవి రేతినేని, సుప్ర జ పులుసు, గణేశ్ కుప్పాల, ఉపాధ్యక్షుడు శుష్ముణ రెడ్డి, ఈవెంట్స్ ఇన్చార్జి మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.